Sharwanand: శర్వానంద్ కి ఇచ్చిన కట్నం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు !

Posted by venditeravaartha, June 7, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మెగా స్టార్ చిరంజీవి గారితో మొదటగా యాడ్ లో నటించి ఆ తర్వాత శంకర్ దాదా ఎంబీబీస్ లో చిన్న రోల్ చేసిన శర్వానంద్(Sharwanand) ఆ తర్వాత వెంకటేష్ గారితో సంక్రాంతి,లక్ష్మి సినిమా ల లో తమ్ముడు క్యారెక్టర్ చేసారు.2008 లో రిలీజ్ అయినా గమ్యం ,2010 లో ప్రస్థానం సినిమా ల తో స్టార్ హీరో గా ఎదిగిన శర్వానంద్..మొన్నటి వరకు ఉన్న తన బ్యాచలర్ జీవితానికి ముగింపు పలికి ఒక ఇంటి వాడు అయ్యాడు.ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ న్యాయవాది అయినా మధుసూదన్ రెడ్డి గారి కుమర్తి అయినా రక్షిత రెడ్డి ని జూన్ 3 నా జైపూర్ లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.అయితే ఆ పెళ్లి ద్వారా శర్వానంద్ కి వచ్చిన కట్నం ఎంత అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.రక్షిత ఎన్ని కోట్లు తెచ్చిందో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు.

sharwa

జైపూర్ లో లీల ప్యాలస్ లో అంగరంగ వైభవంగా జరిగిన తన పెళ్ళికి సినిమా ఇండస్ట్రీ నుంచి చాల తక్కువ మంది మాత్రమే హాజరు అయినట్లు తెలుస్తుంది.తనకు క్లోజ్ ఫ్రెండ్ అయినా రామ్ చరణ్(Ram charan) ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు.కాసేపు శర్వానంద్ కుటుంబం తో గడిపి తిరిగి వెళ్ళాడు.దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి . ఇక తాను పెళ్లి చేసుకున్న రక్షిత రెడ్డి అమెరికా లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఇప్పుడు హైదరాబాద్ లోనే ప్రముఖ కంపెనీ లో సీనియర్ సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్నారు.

ram charan

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అయినా బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారి మనవరాలు అయినా రక్షిత గారు శర్వానంద్ గారికి 5 కిలోల బంగారం మరియు 40 కోట్ల రూపాయల ఆస్తుల ను కట్నం గా ఇచ్చారు అని తెలుస్తుంది.ఇక వీటితో పాటు గా హైదరాబాద్ లో ఓ ల‌గ్జ‌రీ హౌస్ ను గిఫ్ట్ కింద ఇచ్చారు అంట.పెళ్లి తర్వాత శ‌ర్వానంద్‌, ర‌క్షిత త‌మ కొత్త కాపురాన్ని ఆ ఇంట్లో నే స్టార్ట్ చేయనున్నారు.

 

1508 views