జగ్గంపేట లో సుడిగాలి పర్యటన చేసిన తోట నరసింహం

Posted by venditeravaartha, January 4, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

జగ్గంపేట ఇంచార్జ్ గా నియమించటం తో జగ్గంపేట లో పర్యటించి
బోండా కాశీ గారి స్వగృహంలో కార్యకర్తలను నాయకులను కలుసుకుని తధానాతరం వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఒమ్మి.రఘురాం ని కలిసి అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో పాల్గొనటం జరిగింది.

తరువాత శ్రీ వై.యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, రావులమ్మ తల్లి ని దర్శించుకోవడం జరిగింది. జగ్గంపేట ఇంచార్జ్ మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ తోట నరసింహం మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలిపునిచ్చారు. త్వరలో వైసీపీ పార్టీలోకి టీడీపీ నుంచి భారీ చేరికలు ఉండనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో భారీగా వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనటం జరిగింది.

Tags :
158 views