రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయములో పండుగలా అధినేత చంద్రన్న పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేం పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన వేడుకలు రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు *రుడా చైర్మన్ మరియు రాజనగరం నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఘనంగా నిర్వహించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుచూపు అనే పదానికి అయన పర్యాయ పదం,అసాధ్యాలను సుసాధ్యాలు చేయగల నేర్పరితనం, సంస్కరణల అమలులో దూకుడు, సంక్ష్యోబాలనే అవకాశాలుగా మలుచుకునే సమరయోధులు, నాడు “Vision 20-20″తో ప్రపంచం దృష్టిని ఆకర్షించి నేడు స్వర్ణాంధ్ర – 2047తో మరోసారి తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటిన తెలుగుతేజం, విశ్వవిఖ్యాత పద్మభూషణ్ తెలుగుదేశం పార్టీ సృష్టికర్త డా.నందమూరి తారక రామారావు గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన కన్న కలలను సాకారం చేస్తూ,మహిళల పురోభివృద్ధి, స్త్రీ శక్తికి రాజకీయ, ఆర్ధిక, సామాజికంగా సమున్నత స్థానం కల్పించిన మహోన్నత నాయకులు, సైబరాబాద్ మహానగర సృష్టికర్త, అమరావతి రాజధాని రుపశిల్పి, తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రివర్యులు, 75వ వజ్రోత్సవ పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు మహిళలు పాల్గొన్నారు.