Aishwarya rajesh: కేవలం ప్రభాస్ వలనే నా సినిమా కి నష్టం జరిగింది:ఐశ్వర్య రాజేష్

Posted by venditeravaartha, May 19, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తమిళ్ లో వరుస సినిమా లు చేస్తూ బిజీ గా ఉన్నారు మన తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్(Aishwarya rajesh) తాను రీసెంట్ గా నటించిన ఫర్హానా(Farahana) చిత్రం ఇటీవల విడుదల అయ్యి సూపర్ హిట్ అయింది.. తెలుగు ,తమిళ్ ,మలయాళం లో హీరోయిన్ గానే కాకుండా కథ ని బట్టి ఏ క్యారెక్టర్ అయినా చేసుకుంటూ వస్తున్నారు.మన తెలుగు లో ఈమె నటించిన చిత్ర ల లో కౌసల్య కృష్ణ మూర్తి ,టక్ జగదీష్,రిపబ్లిక్ ,వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమా లో మంచి పేరు తెచ్చుకుంది.ఇక ప్రస్తుతం ఈమె 8 సినిమా ల లో నటిస్తూ బిజీ గా ఉన్నారు.

ఫర్హానా చిత్రం విడుదల సమయం లో ఈమె మీద తమిళనాడు లో నిరసన లు వ్యక్తం చేసారు ఆ సినిమా చేయొద్దు అని కానీ తనకి ఆ కథ ,క్యారెక్టర్ నచ్చడం తో నటించాను అని చెప్పారు ఇక ఇదే విషయం మీద తనకి సెక్యూరిటీ కూడా పెంచారు..ఇక పోతే ఈ సినిమా ప్రమోషన్ ల లో టాలీవుడ్ డైరెక్టర్ ల మీద ఈమె చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.ఒక తెలుగు అమ్మాయి ని అయినా నీకు టాలీవుడ్ డైరెక్టర్ లు ఎందుకు పెద్ద ఆఫర్ లు ఇవ్వరో నాకు ఇప్పటికి అర్ధం కావడం లేదు అని అన్నారు.ఇక మరో ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మీకు
తెలుగు లో కమర్షియల్ సక్సెస్ లేనందున మీకు ఇక్కడ అవకాశాలు రావడం లేదా అని అడిగిన ప్రశ్న కి సమాధాం ఇస్తూ ‘నేను తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన కౌసల్య కృష్ణ మూర్తి(Kousalya krishna murthy) సినిమా తమిళ్ ,తెలుగు లో సూపర్ హిట్ అయింది కానీ మా సినిమా రిలీజ్ అయినా వన్ వీక్ కి ప్రభాస్(Prabhas) గారి ‘సాహూ'(Sahoo) రిలీజ్ కావడం మాకు మైనస్ అయింది.ఒక వేళా ఆ టైం లో ప్రభాస్ సినిమా రాకపోయి ఉంటె ఆ సినిమా మంచి కమర్షియల్ సక్సెస్ అయ్యేది అని అన్నారు.

1009 views