Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Sai Pallavi:సాయి పల్లవి ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..ఇక నుండి ఆమెని చూడలేమా?

Sai Pallavi: సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు మంచి డాన్సర్ గా పేరు పొందారు 1992లో జన్మించిన సాయి పల్లవి 2008లో తమిళనాడు లో ఉంగలీల్ యార్ డాన్స్ షోలో పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత 2009లో ఈటీవీలో వచ్చిన డి -4లో టాప్ త్రీ రన్నర్ అప్ గా నిలిచింది. తరువాత తను చదువు మీద దృష్టి పెట్టి జార్జియా వెళ్లి అక్కడ మెడిసిన్ లో జాయిన్ అయ్యారు. 2016లో మెడిసిన్ కంప్లీట్ చేశారు 2017 లోనే మెడిసిన్ చదివేటప్పుడే ప్రేమమ్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టారు.

సాయి పల్లవి ఒక చిన్న రూమర్ కూడా లేకుండా ఇండస్ట్రీలో ఒక సూపర్ లేడీ గా పేరు తెచ్చుకున్నారు. ఈమెను లేడీ పవర్ స్టార్ గా ఫ్యాన్స్ పిలుచుకుంటారు. తెలుగులో నాగచైతన్య తో వచ్చిన ప్రేమ మూవీ లో మొదటిసారి ఈమెను వెండితెరపై అభిమానులు చూసి ఫిదా అయ్యారు. క్యారెక్టర్ ఏదైనా సరే సాయి పల్లవి అందులో జీవించేస్తారు. పాత్ర చిన్నదైనా తన తీసుకోకుండా పాత్రలు చేసుకుంటూ వెళ్తున్నారు సాయి పల్లవి. ఈమె తీసే ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ గా నిలుస్తుంది ఫిదా,లవ్ స్టోరీ, ఎంసీఏ మారి వంటి చిత్రాలతో నటించి హిట్స్ ని అందుకున్నారు సాయి పల్లవి తెలుగు తమిళం మలయాళం మూవీలో నటిస్తున్నారు. అందం డాన్స్ క్రేజీ లుక్స్ తో అభిమానులు ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తుంటారు. ప్రస్తుతం ఓ వార్త ఈమె అభిమానులను నిరాశ పరుస్తుంది ఆ వార్త ఇప్పుడు మీకోసం.

బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణం మూవీ గురించి అందరికీ తెలిసిందే, ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు నితేష్ తివారి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. పెద్ద పెద్ద స్టార్స్ ని ఈ మూవీలో తీసుకో నున్నట్లు సమాచారం. ఈ మూవీలో రాముడిగా రణబీర్ కపూర్ సీతగా సాయి పల్లవి నటించనున్నారు. బాలీవుడ్లో ఇప్పటికే రామాయణం స్టోరీ తో ఆది పురుష్ మూవీ రిలీజ్ అయింది కానీ ఈ సినిమా అంత హీట్ కాకపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి రణబీర్ కపూర్,సాయి పల్లవి నటించిన రామాయణం మూవీ వైపు మళ్లింది. సినీ ఇండస్ట్రీలో ఆర్టిస్టు లుక్స్ బయటికి రాకుండా మూవీ టీం జాగ్రత్త పడుతూ ఉంటారు.

అలాగే ఈ రామాయణం మూవీ నుండి కూడా ఎలాంటి లీక్స్ రాకుండా చిత్ర బంధం పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు అందుకుగాను సాయి పల్లవి, రణబీర్ కపూర్ లో కొంతకాలం బయటకి పబ్లిక్ గా కనిపించకూడదని సూచించినట్లు సమాచారం. ఈ మూవీ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు ఎవరు బయటికి కనిపించకూడదని నితేష్ చెప్పినట్లు సమాచారం. ఏప్రిల్ 17 శ్రీరామనవమి సందర్భంగా ఈ మూవీ అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. మరి అప్పటివరకు సాయి పల్లవి ఫ్యాన్స్ కంట పడదంటే ఆ న్యూస్ వారి అభిమానులను నిరాశపరిచినట్లే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏది ఏమైనా,ఈ మూవీ బాలీవుడ్ లోనే కాక మన తెలుగులోనూ మంచి హిట్స్ సాధించాలని కోరుకుందాం.

Exit mobile version