Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Meera jasmine:10 సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్! క్రేజీ కాంబినేషన్ లో మూవీ..

మీరా జాస్మిన్ ఈ పేరు విని చాల రోజులు అవుతుంది ,కానీ అప్పట్లో ఆమె కి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు.రన్ అనే తమిళ సినిమా ద్వారా తమిళ్ ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన మీరా జాస్మిన్ అక్కడ మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.ఇక అక్కడ వరుసగా పెద్ద సినిమా ల లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయి కి ఎదిగారు.ఇక అమ్మాయి బాగుంది సినిమా తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గుడుంబా శంకర్ సినిమా తో మంచి గుర్తిపు లభించింది.ఆ వెంటనే భద్ర సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

తెలుగు ,తమిళ్ ,మలయాళ సినిమా ల తో బిజీ గా ఉన్న మీరా జాస్మిన్ కి 2008 లో రిలీజ్ అయినా గోరింటాకు సినిమా తో కమర్షియల్ గా సక్సెస్ రావడం ఆగిపోయింది.ఆ తర్వాత ఆమె చేసిన సినిమా లు ఆమె నటించిన సినిమా లు సరిగా ఆడలేదు.2013 లో రిలీజ్ అయినా మోక్ష సినిమా నే ఆమెకి తెలుగు లో చివరి సినిమా.ఇక 2014 లో వివాహం తర్వాత సినిమా ల కి దూరం అయినా మీరా జాస్మిన్ ఇప్పుడు మరల సినిమా లో నటిస్తున్నారు.

2014 తర్వాత సినిమా ల నుంచి దూరంగా ఉన్న ఈమె ఇప్పుడు ఒక తమిళ్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు ,వై నాట్ స్టూడియో ప్రొడక్షన్ లో శశి కాంత్ డైరెక్ట్ చేస్తున్న సినిమా లో మీరా జాస్మిన్ నటిస్తున్నారు.ఈ సినిమా లో మాధవన్ ,సిద్దార్ధ్ హీరో గా చేస్తుండగా నయనతార ప్రధాన పాత్రా లో నటిస్తున్నారు ,మరొక ముఖ్య పాత్రా లో మీరా జాస్మిన్ నటిస్తున్నారు.మరి 9 సంవత్సరాల తర్వాత నటిస్తున్న ఈ సినిమా ద్వారా మీరా జాస్మిన్ గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వాలి అని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Exit mobile version